03-02-2026 02:09:50 AM
శ్రీరంగాపురం ఫిబ్రవరి 2: ట్రాక్టర్ రివర్స్ పడి వ్వక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివ రాల ప్రకారం మండల కేంద్రంలో తన స్వంత పోలంలో ట్రాక్టర్ పని చేస్తుండగా ఏదుట్ల శ్రీను (45) ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి ఉన్నారు .గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.