calender_icon.png 25 June, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

24-06-2025 10:10:19 PM

పాపన్నపేట: వెనక నుండి కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల కేంద్రం పాపన్నపేట శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) కథనం ప్రకారం వివరాలు... పెద్ద శంకరంపేట మండలం జుక్కల్ గ్రామానికి చెందిన మచుకూరి లక్ష్మయ్య(67) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తన టీవీఎస్ ఎక్స్ఎల్ పై తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో పాపన్నపేట శివారులోని రాగానే వెనక నుంచి వస్తున్న కారు అతి వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కొడుకు సంగమేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని ఎస్సై పేర్కొన్నారు.