calender_icon.png 20 December, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణితమే జీవిత గమనం

20-12-2025 07:54:13 PM

కమ్మరపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల్లో చాలామందికి గణితం అంటే ఒక భయం ఉంటుందని దానిని అధిగమిస్తే  మంచి ఫలితాలు పొందవచ్చని  మండల విద్యాశాఖ అధికారి ఆంద్రయ్య అన్నారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకుని కమ్మర్పల్లి ఎమ్మార్సీలో మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితం గొప్పతనాన్ని వివరించారు. గణిత సబ్జెక్టులో పూర్తిస్థాయి పట్టు సాధిస్తే  అన్ని అంశాలను ముందంజలో ఉండవచ్చని, స్పష్టం చేశారు. పదవ తరగతి పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా ముందడుగు వేయాలని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

తెలంగాణ గణితపురం రాష్ట్ర సలహాదారులు కోనాపూర్ ప్రధానోపాధ్యాయులు చౌడారాపు రాం ప్రసాద్ విద్యార్థులందరికీ గణిత ఫార్ములాలు అందజేశారు. మండల స్థాయిలో ఆంగ్ల మధ్యమంలో పీఎంఎస్హెచ్ఆర్ఐ జెడ్పిహెచ్ఎస్ చౌట్పల్లి విద్యార్థులు ఎస్ ప్రణవి, సిహెచ్ మధుప్రియ, బి ప్రణవి, వై సోమిత్ లు వరుసగా మూడు స్థానాలు సాధించి జిల్లాకు ఎంపికయ్యారు. తెలుగు మాధ్యమంలో కే లికిత, ఏం రచిత కే గంగాదేవిలు  వరుసగా మూడు స్థానాలు సాధించి జిల్లా ఎంపికయ్యారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.