23 June, 2026 | 8:17 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాబివృద్ధిపై శిక్షణ

20-12-2025 07:59 PM

కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో శనివారం బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్,  ఎలక్ట్రికల్ మూడవ  సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు ఎం. వెంకటేష్  ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులలో  విద్యార్థి నులకు పోటీ పరీక్షలలో అప్టిట్యూడ్ మరియు రీజనింగ్  ఏవిధంగా ఉపయోగ పడుతుందో ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యార్థి నులకు అవగాహనా కల్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ  నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను  పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.