31-05-2025 12:06:37 AM
వారిలో ఆరుగు మహిళలు: వెల్లడించిన కొత్తగూడెం ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట శుక్రవారం 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్ హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రోహిత్రాజ్ వివరాలు వెల్లడించారు.
ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.
ఈ క్రమంలోనే శుక్రవారం 17 మంది లొంగిపోయారని చెప్పారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలిపారు. ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, నలుగురు పార్టీ సభ్యులు, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 282 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.