31-05-2025 12:09:01 AM
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి
హుజూర్ నగర్: హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డ్ గణేష్ నగర్ లో మున్సిపల్ నిధులు నుండి సుమారు 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత మంత్రివర్యులు అప్పటి పార్లమెంట్ సభ్యులుగా వార్డ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేశారు.
వారి సహాయ సహకారాలతో హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలియ జేయడం జరిగింది.గడిచిన ఐదు సంవత్సరాల్లో మూడవ వార్డ్ రూపు రేఖలు మార్చేశాం అని తెలియజేసు కుంటున్నాం. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి బాబు, 25వ వార్డ్ కంటెస్టెంట్ కౌన్సిలర్ చంద్రశేఖర్, మూడవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షులు పగిడి నాగేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల వెంకటరెడ్డి, దగ్గుబాటి బాబురావు, కార్తీక్, నియోజకవర్గ యూత్ సెక్రెటరీ పిల్లి శివ తదితరులు పాల్గొన్నారు.