19-12-2025 10:53:24 AM
హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి(Maoist Party) భారీ షాక్ తగిగింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు(Maoists Surrender) సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్ తో శుక్రవారం నాడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగిపోనున్నారు. లొంగిపోయేవారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఆరుగురు ఒడిశా, ఛత్తీస్ గఢ్ కు చెందిన డివిజన్ కమిటీ సభ్యులున్నారు. ఈ లొంగుబాటుకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) వివరాలు వెల్లడించనున్నారు.