11 March, 2026 | 2:04 PM

Breaking News

హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •   తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం   •  

రోటరీక్లబ్ సేవలు అభినందనీయం

20-01-2026 07:57 PM

 ప్రధానోపాధ్యాయుడు అజామోహినుద్దిన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు రోటరీక్లబ్ సేవలు అందించటం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు అజామోహినుద్దిన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మంగళవారం రోటరీక్లబ్ సెక్రటరీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు అజామోహినుద్ధిన్ సమక్షంలో భోజన ప్లేట్లు అందజేశారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుని చదువుతోపాటు ఆటల్లో ఉన్నతంగా రాణించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు 350 భోజన ప్లేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మూర్తి ప్రకామ్, శారద, నారాయణమూర్తి, యూసఫ్, శ్రీహరి, కల్నల్ కామేస్, గంగాధర్, కుదయ్ కుమార్, రాజగోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.