30 May, 2026 | 4:17 PM

జైనూర్ మేజర్ పంచాయతీలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు

30-05-2026 03:44 PM

సర్పంచ్ కొడప ప్రకాష్ నూతన బోర్‌వెల్‌ల పరిశీలన

జైనురు,(విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ కొడప ప్రకాష్ తెలిపారు. పంచాయతీ నిధులతో మోమిన్‌పుర, సోను పటేల్‌గూడలో నూతనంగా వేసిన తాగునీటి బోర్‌వెల్‌లను శనివారం ఆయన పరిశీలించారు.

బోర్‌వెల్‌ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కొడప ప్రకాష్ ప్రజలకు సూచించారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.