26-05-2025 05:47:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుదర్శనం(District Electricity Department Supervising Engineer Sudarshanam) తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని విద్యుత్ సిబ్బంది 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు గృహ వినియోగదారులు వర్షం కురుస్తున్నప్పుడు విద్యుత్ వైర్లను సరి చేయవద్దని వేలాడుతున్న ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు గమనిస్తే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. పశువులను కూడా ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా మేత కోసం తీసుకెళ్లవద్దని పేర్కొన్నారు