10 June, 2026 | 2:59 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలి

15-10-2025 08:03 PM

గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు బంద్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

మెదక్ (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలించాలన్నారు. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలన్నారు. గంజాయి సాగు చేస్తే రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు నిలుపు చేయాలన్నారు.

రైతు వేదికల వద్ద గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలను రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ కూడళ్ల వద్ద, మెడికల్ షాప్ లు, పరిశ్రమల వద్ద తనిఖీలు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ డాబాల వద్ద, వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఉపాధి కోసం వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.