1 July, 2026 | 6:36 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

జీకే ఒలంపియాడ్‌లో ఆల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు

26-03-2025 01:07 AM

కరీంనగర్, మార్చి 25 (విజయ క్రాంతి): జోనల్ స్థాయి స్మార్ట్ కిడ్స్ జి.కె ఒలంపియాడ్లో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు పాల్గొని అత్యధిక పతకాలు సాధించారు. పాఠశాలకు చెందిన వి. ఆశ్రిత రెడ్డి,  సి.హెచ్. సోహన్, పి. మయాంక్ రెడ్డి,  సాగి శ్రీదాత్రి, యు. రితేష్, ఇ. లిఖిత్ కుమార్, ఇ. రాజ్ ఆరుష్ పటేల్, కె. తనీష్ రెడ్డి, కె. రిషిక్ లు జోనల్ స్థాయిలో మెడల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కైవసం చేసుకున్నారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. అత్యధిక పతకాలతో ఘనవిజయం కైవసం చేసుకునందుకు పుష్పగుచ్చాలతో పాటు జ్ఞాపికలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆకాంక్షించారు.