17-06-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, జూన్ 16:జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటి, నీట్ ప్రవేశ పరీక్ష ల్లో మేడ్చల్ పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. 2024 - 25 విద్యా సంవత్సరంలో స్ఫూర్తి జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసి ఐఐటి జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 826 ర్యాంకుతో మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండా గ్రామానికి చెందిన కరంతోడ్ బబ్లు నాయక్ ఐఐటి ఖరగ్ పూర్ లో మొదటి ప్రయత్నంలోనే సీటు దక్కించుకున్నాడు.
అదే కళాశాలలో బైపిసి పూర్తిచేసు కుని నీట్ ప్రవేశ పరీక్షల్లో శ్రీ వైష్ణవి, ఎస్. వైష్ణవి, శ్రీనిధి, విష్ణువర్ధన్ రెడ్డిలు ఉత్తమ ప్ర తిభ కనబరిచి మంచిర్యాంకులను సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి ర్యాం కులను సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం సోమ వారం ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.