16-06-2025 11:32:43 PM
ఇబ్రహీంపట్నం: బాలిక అదృశ్యమైన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, కూర్మల్ గూడలోని ఇంద్రా నగర్ కాలనీకి చెందిన కోవటి యశస్వినీ (18), 9వ తరగతి వరకు చదివి, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నది. ఆదివారం యశస్వినీ ఇంట్లో వదిలి, తల్లిదండ్రులు ఫంక్షన్ కి వెళ్ళారు. తిరిగి అర్థరాత్రి 12.30 గంటలకు వచ్చి చూడగా అమ్మాయి ఇంట్లో కనిపించలేదు.
చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయి ఎత్తు: 5 అడుగులు, తెలుపు రంగు, తెలుగు, హింది భాషలు మాట్లాడగలదు. ఆచూకీ తెలిసిన వారు ఆదిభట్ల పోలీసు స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.