17-06-2025 12:00:00 AM
లఘు చిత్రం సీడీని ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, జూన్ 16 (విజయ క్రాంతి) : వర్షాకాలంలో పిడుగులు పడుతున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉం డాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించా రు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పాటుకు ఆరుగురు దుర్మరణం చెందిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందు కు పిడుగుపాటుల నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచార శాఖ ఆధ్వ ర్యంలో తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులతో లఘు చిత్రంను రూపొందిం చారు.
ఈమేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లఘు చిత్రం సీడీ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కారు మబ్బులు కమ్ము కుని.. భారీ శబ్దాలతో ఉరుములు.. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ పిడుగుపాటుకు ఎంతో మంది మనుషులు, ఎన్నో పశువులు మరణిస్తున్నాయ న్నారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్లకింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉన్నవారే ఈ పిడుగుపాటుకు గురవుతున్నట్లు పలు ఘటనలతో తేటతెల్లమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీపీఆర్ఓ తిరుమల, పలువురు కళాకా రులు పాల్గొన్నారు.