31-05-2025 12:30:51 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మన్ననూర్లో రెండు రోజుల పాటు జర్నలిస్టులకు నిర్వహించిన శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు నిజాయితీ నైతికతతో పనిచేసి సమాజాన్ని ప్రభావితం చేయాలన్నారు. చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... డిజిటల్ శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణలో మీడియా సహకారం కీలకమని నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, శిక్షణ పొందిన ప్రతినిధులు పాల్గొన్నారు.