31-05-2025 12:30:04 AM
మణికొండ మే 30 : మణికొండ పుప్పాలగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో అపర్ణ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పై జిల్లా విద్యాశాఖ కొరడా ఝళిపించింది. కనీస సౌకర్యాలు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న అపర్ణ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుమతులు రద్దు చేసి, స్కూల్ సీజ్ చేశారు.
గతేడాది నుంచే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ పాఠశాలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా, విద్యార్హత గల టీచర్లను పెట్టుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలా డుతోంది ఈ స్కూల్ యాజమాన్యం.
ఈ విషయాలపై గత ఏడాదే అపర్ణ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యాన్ని హెచ్చరించామని, అయినా సౌకర్యాలు కల్పించకుండా ఈ ఏడాది అడ్మిషన్స్ ప్రారంభించడంతో ఈ రోజు స్కూల్ అనుమతులు రద్దు చేసి, స్కూల్ సీజ్ చేశామని ఎంఈవో విజయ్ కుమార్ తెలిపారు.ఈ పాఠశాలలో దాదాపు 200 స్టూడెంట్స్ చదువుకుంటన్నారు.