20-09-2025 12:00:00 AM
వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుస్తానారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళ లకు సంబంధించిన అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు.
శుక్రవారం చిన్నపిల్లల వైద్య నిపుణులు ఆరోగ్య కేంద్రం లో పరీక్షలు చేశారు. గ్రామపంచా యతీ ఆలబాక నుండి ఏదిర గ్రామపంచా యతీ సిబ్బందికి ఈరోజు స్వచ్ఛత హీ సేవ స్వేచ్ఛ ఉత్సవంలో భాగంగా సిబ్బందికి వైద్య పరీ క్షలు నిర్వహించారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోరం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో గ్రామపం చాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మాతా శిశువు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్, గ్రామపం చాయతీ సెక్రటరీ శృతి, వారి సిబ్బందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదిర తీసుకొని రావటం జరిగింది. ఐటీడీఏ ఏటూరి నాగా రం డిప్యూ టీ డి ఎం అండ్ హెచ్ ఓ కోరం క్రాంతి కుమార్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవి తేజ, మాతా శిశువు సంరక్షణ వైద్య అధికారి భాస్కర్, ఎం ఎల్ హెచ్పి పి.మనోహర్, పి హెచ్ ఎన్. ఏకలక్ష్మి, హెచ్ ఇఓ కోటిరెడ్డి, హెచ్వి రామలక్ష్మి, సూపర్వై జర్స్ వెంకటేశ్వ రావు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.