calender_icon.png 21 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతకోసం ధ్యాన మందిరం

05-06-2025 12:57:48 AM

- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, జూన్ 4 (విజయక్రాంతి):ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎ మ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యా న మందిరంలో ధార్మిక కార్యక్రమాలను ఐకమత్యంగా అందరి సహకారంతో కార్యక్రమాలు కొనసాగించాలని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ అన్నారు.

బుధవారం ధ్యాన మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా  మంచి రోజు పురస్కరించుకొని పుణ్యాహవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని బ్రాహ్మణు లలో చాలామంది నిరుపేదలు ఉన్నారని వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ధ్యాన మందిరం ఉపయుక్తంగా ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపినారు. 

ధ్యాన మం దిరము ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇల్లు  శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే దాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల శ్రీనివాస్, మోతే ఉమాకాంత్ శర్మ , మందిరం భారవిశర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, చం ద్రశేఖర్, శ్రీధర గణపతి, పార్థసారథి శర్మ, వేణుగోపాల్, శ్రీనివాస్, కార్తీక్, కిరణ్, ఈవో సురేందర్, వార్డు నాయకులు అనుమల్ల రఘు, భాస్కర్ శర్మ  రాజేందర్ శర్మ తదితరులుపాల్గొన్నారు.