05-06-2025 12:57:33 AM
బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు
చర్ల, జూన్ 4 (విజయక్రాంతి):ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు. బుధవారం చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉద్యోగుల వయోపరిమితి పెంచే ఆలోచన మానుకోవాల ని, ఇప్పటికే నిరుద్యోగలు చాలా నష్ట పోయారని వారి వయోపరిమితి దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక సంవత్సరం లో వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని వారి వయోపరిమితి పెంచితే వేల మంది నిరుద్యోగులకు నష్టం జరిగుతుందని, నిరుద్యోగులలో అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగానికి సరిపడా వయస్సు దాటి పోతుందని అన్నారు. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేక ప్రభుత్వాలు వయోపరిమితి పెంచుకొంటు పోతే నిరుద్యోగల పరిస్థితి ఏమౌతుందని ఆయన ప్రశ్నించారు.
62 సంవత్సరాల వయస్సులో ఉద్యోగి ఏం పని చేయగలడను బిపి, షుగర్ వ్యాధులతో బాధపడుతూ వృత్తి ధర్మాన్ని పాటించలేకపోతున్నారన్నారు. నిరుద్యోగుల సంఖ్య దేశంలో పెరిగిపోయి తీవ్రవాదం వైపు నిరుద్యోగులు దారి మల్లే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండ, ఉద్యోగ సంఘాలు కూడా దీనిని వ్యతిరేకరించాలని ఉద్యోగుల వయోపరిమితి పెంచుటకు ప్రభుత్వం ఆలోచన చేయవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబోజు సతీష్, బుల్లబ్బాయి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.