calender_icon.png 26 October, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం

26-10-2025 05:24:53 PM

దినచర్యలో యోగ ఒక భాగం కావాలి 

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్ (విజయక్రాంతి): నిత్య జీవితంలో యోగను అలవర్చుకున్నట్లయితే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆనందోబ్రహ్మ యోగమండలి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యోగ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగ చేయడం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. యోగతో ఆరోగ్యవంతమైన ఫలితాలు అందుతాయి అన్నారు. ఎంతటివత్తిడినైనా జయించవచ్చన్నారు. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, ఏవియం విద్యాసంస్థల అధినేత కందాలపాపిరెడ్డి, నాయకులు నకిరేకంటి ఏసు పాదం, మురారి శెట్టి కృష్ణమూర్తి, యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, ఆనందోబ్రహ్మ యోగ మండలి ప్రధాన గురూజీ మిరియాల చల్మరాజు, సంస్థ సీనియర్ సభ్యులు బ్రహ్మదేవర రామ్మూర్తి, జితేందర్ రెడ్డి, నాయకులు,యోగ మండలి సభ్యులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. వేముల వీరేశం 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నకిరేకల్మండలంలోని నోముల, వల్లభాపురం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవ్వరు ఆందోళన చెందదు ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. రైతులు దళారి చేతుల్లో మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, నాయకులు నకిరేకంటి ఏసు పాదం, గాదగోని కొండయ్య, యాస కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు..