11-12-2024 06:03:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): వరంగల్ నగరాభివృద్ధిపై అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, వరంగల్ భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై చర్చించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన గడువులోకా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.