15 April, 2026 | 12:29 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ధనిక రాష్ట్రం అంటూ ప్రజలను మోసం చేశారు: మంత్రి పొంగులేటి

12-05-2025 02:42 PM

హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించారు. మున్నేరు రిటర్నింగ్ వాల్ పనులను మంత్రి పరిశీలించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు ధనిక రాష్ట్రం అంటూ ప్రజలను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ఈ విషయమే చెప్తారని తెలిపారు. పేదలకు న్యాయం చేసేది ముమ్మాటికి ఇందిరమ్మ ప్రభుత్వమేనని పొంగులేటి పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాల్( Munneru retaining wall works) పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.