12-05-2025 08:06:33 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని మస్కాపూర్ ఉపాధ్యాయులు సోమవారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులు నరేష్, శేఖర్, ఇస్మాయిల్ తదితరులు పిల్లల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రభుత్వ పాఠశాలల సద్విని యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నారు. వేసవి సెలవులు ఇంటింటికి తిరుగుతూ పాఠశాలలో పిల్లలను చేర్పించే విధంగా తల్లిదండ్రులను కోరుతున్నారు.