27-12-2025 05:13:35 PM
కాంగ్రెస్ నాయకులు ఇందారపు అనిల్
మంథని,(విజయక్రాంతి): మంథని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అని కాంగ్రెస్ నాయకులు ఇందారపు అనిల్ అన్నారు. మంథని మండలంలోని నాగారం బస్టాండ్ నుండి కన్నాల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రహదారి విస్తరణకు రూ.2.50 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు నూతన రహదారి కోసం రూ.1.80 కోట్ల నిధులు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నిధులు మంజూరు చేయడం పై కాంగ్రెస్ నాయకులు ఇందారపు అనిల్ హార్షం వ్యక్తం చేశారు.