calender_icon.png 2 December, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

02-12-2025 12:22:07 PM

ఫ్యూచర్ సిటీ పనులపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష.

మూడు షిఫ్టుల్లో పనిచేసి.. వేగంగా పూర్తిచేయాలి.

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పనులపై(Future City works) మంత్రి శ్రీధర్ బాబు సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) ఏర్పాట్లపై శ్రీధర్ బాబు చర్చించారు. గ్లోబల్ సమ్మిట్ పనుల పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆర్ అండ్ బీ అధికారులపై శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవసరమైతే మూడు షిఫ్టుల్లో పనిచేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సజావుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పలువురు కేంద్రమంత్రులను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు.