13-12-2024 02:09:25 AM
కామారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శుక్రవా రం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించనున్నారు. నిజాంసాగర్ మండ లం గొర్గల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో మంత్రి దిగిన అనంతరం రోడ్డు మార్గంలో నిజాంసాగర్ హెడ్స్లూజ్ ప్రధాన కాల్వ వద్దకు చేరుకోనున్నారు. అక్కడ కాల్వ గేట్ల ను ఎత్తి నీటిని విడుదల చేయనున్నా రు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూడా ఉండనున్నారు. కాగా నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాల కా ంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ అప్ప తెలిపారు.