05-06-2025 01:24:05 AM
కామారెడ్డి, జూన్ 4 (విజయ క్రాంతి); కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను పరామర్శించారు.
అనంతరం ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజి హాస్పిటల్ చైర్మన్, వ్యవస్థాపకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డా. నాగేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, డా. దువ్వూరు ద్వారకనాథ రెడ్డి పరామర్శించి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.