12-11-2025 01:59:16 PM
హైదరాబాద్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క పర్యటించారు. ముందుగా కోట్లాది భక్తుల కొంగుబంగారమైన మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నాను.