13-06-2025 02:03:13 AM
చేగుంట, జూన్ 12 : చేగుంట పట్టణ కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ 20వ వార్షికోత్సవ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్ గుప్తా, తాజా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ముదం శ్రీని వాస్, అయిత రఘురాములు, అయిత పరంజ్యోతి, అన్నం రవి, డిష్ రాజు, అవుబోతు నాగరా జు, అలీ, తుడుపునురి రాజు, శ్రీకాంత్ యాదవ్, యువ నాయకులు ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.