calender_icon.png 16 June, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ ముందస్తు నిర్ధారణకు స్వీయ పరీక్ష తప్పనిసరి

13-06-2025 02:02:46 AM

కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ క్రైం, జూన్ 12 (విజయ క్రాంతి): మహిళలు స్వీయ పరీక్ష ద్వారా రొ మ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించవచ్చ ని, తద్వారా ప్రాణాపాయ ముప్పు తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సనా చారిటబుల్ ట్రస్ట్, ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం పోలీస్, మున్సిపల్ మహిళా సిబ్బందికి ఉచి త క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, సనా ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు సురభి సత్తయ్య, కోఆర్డినేటర్ తదితరులుపాల్గొన్నారు.