calender_icon.png 14 July, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అధికారులపై ఎమ్మెల్యే ఫైర్..

14-07-2025 12:15:55 AM

- తీరు మారకపోతే సీఎంకు ఫిర్యాదు చేస్తా..

- చిన్న బాబుకో రూల్.. నాకో రూలా..?

- ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే వినోద్ వార్నింగ్

బెల్లంపల్లి అర్బన్, జూలై 13: బెల్లంపల్లి అటవీ శాఖ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మె ల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మండిపడ్డారు. మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో ఆదివారం అటవీ శాఖ ఆధ్వర్యం లో జరిగిన వనమహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. నేన్నెల మండలంలో పత్తి రైతుల సాగు భూమిని ధ్వంసం చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్న విషయo, పోడు భూములపై అటవి అధికారుల తీరు పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులకు ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి వ్యతి రేకంగా పనిచేయడం సరికాదనీ మండిపడ్డా రు.

నియోజకవర్గంలో పొడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే గట్టిగా చెప్పా రు. చినబాబు (ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివే క్) చెన్నూర్ నియోజకవర్గంలో అధికారులది ఒక రూలు బెల్లంపల్లి నియోజకవర్గంలో మరోక రూలా? అనీ అటవీ శాఖ అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని అధికాలను హెచ్చరించారు.

ఏమైనా సమస్యలు ఉంటే అటవీ అధికారులు తమ దృష్టికి తీసుకురావాలని, అంతేకానీ  రైతులను ఇబ్బందికి గురిచేస్తే మాత్రం సహిం చబోమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అటవీ అధికారులపై అగ్ర హం వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. అంతేగాని అటవీ  అధికారులు నేరు గా వెళ్లి రైతుల పంటలను ధ్వంసం  చేయో వద్దని ఆదేశించారు. నియోజవర్గంలో ఇలాంటి సమస్యలు పొరపాటు కాకుండా నడుచుకోవాలని అటవీ అధికారులను కాసింత గట్టిగానే మందలించడంతో రైతులకు ఊరట కలిగింది.