పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే జీఎంఆర్
జిన్నారం/అమీన్పూర్, మార్చి 26: ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో దోహదపడతాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గడ్డ పోతా రం మున్సిపల్ పరిధిలోని మాదా రం గ్రామంలో నూతనంగా నిర్మించిన 42 అడుగుల పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎం ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయం దేవాలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచముఖి హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, విగ్రహ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




