రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్
బీజేపీ అసత్య ప్రచారాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం: ఎమ్మెల్యే హరీశ్రావు
మెదక్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మెద క్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ వాళ్లు ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఓటమి భయంతోనే ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. వారిపై ఎన్ని కల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడు తూ పదేండ్లలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని, మొదటి నుంచి తెలంగాణ అంటే మోదీకి సవతితల్లి ప్రేమ ఉంద న్నారు.
ఒకరు మతంతో, మరోకరు కులం తో పోటీకి వస్తే తాము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నామని, బీఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు తమదేనన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు వ్యాఖ్య లు హాస్యాస్పదంగా ఉందని, దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చెల్ల్లుతుందా అని హరీశ్రావు ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి జీవితం తెరిచిన పుస్తకమన్నారు. భూసేకరణ ఆయన ఇంటికోసం చేయలేదని, లక్షల ఎకరాల్లో పంట పండింది అంటే దానివెనక వెంకట్రామిరెడ్డి చెమట చుక్కలు ఉన్నాయని హరీశ్రావు కొనియాడారు. మెదక్ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్దే నని ధీమా వ్యక్తం చేశారు.