14-06-2025 12:13:37 PM
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు.. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం లీప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మార్చారని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని, కాళేశ్వరానికి అన్నీ నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ఇంజనీర్స్ దే పాత్ర ఉందని, తమకు ఏం సంబంధం లేదన్నాడం సరికాదని చెప్పారు. కాళేశ్వరం నిర్మించాక ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదని, ఎల్లంపల్లి ద్వారానే పంటలకు నీళ్లు అందుతున్నాయని కూనంనేని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రం భయపడుతోందని ఆయన విమర్శించారు. కేశవరావు మృతదేహాన్ని అప్పగించకపోవటం దారుణామని ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.