calender_icon.png 9 June, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించే కమ్యూనిస్టులను లేకుండా చేస్తామనడం అవివేకం

08-06-2025 11:06:09 PM

కమ్యూనిస్టులను లేకుండా చేస్తామన్న వారు చరిత్రపుటల్లో కనుమరుగయ్యారు..

వామపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ విధానాలకు వ్యతిరేకం..

సీపీఐ జిల్లా 4వ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు..

సూర్యాపేట (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే కమ్యూనిస్టులను లేకుండా చేస్తామనడం అవివేకం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంభశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. ఆదివారం స్థానిక రిధికా ఇన్ హోటల్లో నిర్వహించిన సీపీఐ సూర్యాపేట జిల్లా 4వ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టులను లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వ బహిరంగ రహస్యమన్నారు.  మా మొదటి శత్రువు ముస్లీంలు, రెండో శత్రువు క్రైస్తవులు, మూడో శత్రువు కమ్యూనిస్టులంటూ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందన్నారు.

చర్చలకు తాము సిద్దమని మావోయిస్టులు కోరుతున్నా మేము మిమ్మల్నీచంపుతామంటూ ఫాసిస్టు పాలనను ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఇలాంటి పాలన ఎంతో కాలం నడువాదని అలా అనుకున్న వారు చరిత్రలో కలసి పోయారన్నారు. కమ్యూనిజం పెద్ద భూతమని దాన్ని లేకుండా చేస్తామన్న హిట్లర్ అంతమై పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 60వేల కోట్ల బకాయిల నుంచి బయటపడడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక వ్యూహం లేదని కమ్యూనిస్టులతో పాటు మేధావులు, విద్యావంతుల సలహాలు తీసుకొని ముందుకు వెళితే మంచి పాలన సాగించే అవకాశం ఉంటుందన్నారు.

తాము వామపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ బీజేపీతో ఒక సఖ్యత ఏర్పడుతున్నట్లు కవిత మాటలతో మాకు అర్దమవుతుందన్నారు. తదుపరి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ వారి కార్యకర్తలకు నాయకులకే ఇచ్చిందన్నారు.  ప్రభుత్వం నిష్పక్షపాతంగా పేదలకే సంక్షేమ పథకాలు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో లోపం జరుగుతుందన్నారు.

కాబట్టి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజమైన అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో  రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఉస్తెల సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనంజయ నాయుడు, మేకల శ్రీనివాసరావు, వాడపల్లి గోపి, దేశ గాని హేమలత ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు.