18-06-2025 08:49:04 PM
ఇల్లెందు (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని బుధవారం హైదరాబాదులో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) కలిశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచేలా కృషి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.