calender_icon.png 19 June, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు..

18-06-2025 08:46:06 PM

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

హనుమకొండ (విజయక్రాంతి): ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కస్తూరిభా గాంధీ పాఠశాలలో 25 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, 3 లక్షల 50 వేల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హై మాస్ లైట్లను అలాగే ముప్పారం గ్రామంలో 27 లక్షల నిధులతో నిర్మించిన సీసీ డ్రైన్, 20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya)తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) ప్రారంభించారు. ధర్మసాగర్ మండలం ముప్పారం శివారులోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పదో తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ విద్యను అందిస్తానని వారిని ప్రోత్సహించారు.

అలాగే ముప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకువెళుతుందని అన్నారు. నిరుపేదలకు ఉండేందుకు నీడ కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పాటు యువతకు 59 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డీఎంహెచ్వో అప్పయ్య, పీఆర్ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ సదానందం, ఎంపిడివో అనిల్, ఏఈలు, మెడికల్ ఆఫీసర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.