24-02-2026 12:03:34 AM
కోదాడ ఫిబ్రవరి 23: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో 99. 56 పర్సంట్తెల్ సాధించిన రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు ముక్కా చరణ్ సాయి గౌడ్, ఐ. కృష్ణ చరణ్, 95.63, సిహెచ్ భాను శంకర్ 94.78 విజయ్ చరణ్ 92.52, జె ప్రవీణ్ 92.16 లను సోమవారం క్యాంప్ ఆఫీసు నందు ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బాణాలవసంత వెంకటరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, కె. శివ శంకర్, గద్దె సతీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.