16 April, 2026 | 6:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బస్సు షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

12-04-2025 05:50 PM

అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద ఐటీసీ వారి సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఐటిసిసిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.10 లక్షల నిర్మించిన బస్ షెల్టర్ ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయాణికులు బస్ షెల్టర్ ను సద్వినియోగం చేసుకొని, పరిశుభ్రంగా ఉంచి వినియోగించుకోవాలని, ఊరికి దూరంగా ఉండటం వలన ప్రయాణికులకు ఎంతగానో ఈ బస్ షెల్టర్  ఉపయోగపడుతుందన్నారు. అనంతరం బస్సు షెల్టర్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటిసి మేనేజర్ చంగల్ రావు, తాసిల్దార్ స్వర్ణలత, ఎంపీ ఓ ముత్యాలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదకేశవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తూము రాఘవులు, భూ రెడ్డి వెంకట్ రెడ్డి, బేతం రామకృష్ణ, చుంచు ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.