29 May, 2026 | 2:55 AM

సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

29-05-2026 12:02 AM

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే 

సత్తుపల్లి, మే 28 (విజయ క్రాంతి) : సత్తుపల్లి పట్టణం  మసీద్ రోడ్ - నవ్య శారీస్ శ్రీను  తండ్రి రేపాకుల కృష్ణారావు ఇటీవల మరణించగా  వారి  నివాసానికి వెళ్ళిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర మట్టా రాఘమయి దయానంద్ గురువారం వారి చిత్రపటానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.  సత్తుపల్లి పట్టణం కిరాణా మార్చంట్ రోడ్  నారాయణపురపు వెంకటేశ్వర్లు  దశ దిన కర్మ కార్యక్రమం లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసివారి కుమారుడు శ్రీను ని పరామర్శించిన ఎమ్మెల్యేరాగమయి దయానంద్.