23 May, 2026 | 2:27 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

వీహెచ్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

23-03-2026 01:13 AM

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హను మంతరావును అంబర్‌పేటలోని ఆయన నివాసంలో ఆదివారం పీసీసీ ఓబీసీసెల్ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మార్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలనే ఓబీసీ సెల్ చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్ నియామకం కావడంతో.. సోమవారం బాధ్యతలు తీసుకుండటంతో వీహెచ్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ వర్గాలు కాంగ్రెస్ వైపు మళ్లించే విధంగా పని చేయాలని, కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ భేటీలో ఓసీసెల్ రాష్ట్ర కన్వీనర్ కేతూరి వెంకటేష్, డాక్టర్ జూలూరి ధనలక్ష్మి, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాత్‌గౌడ్ పాల్గొన్నారు.