11 May, 2026 | 12:18 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

అసంపూర్తి పనులను పూర్తి చేయాలి

24-03-2025 03:23 PM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో సోమవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వాటర్ వర్క్స్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు పలు సమస్యలను వివరించారు. కాలనీలో రోడ్ల నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి, పనులు పూర్తి చేయలేదన్నారు. డ్రైనేజీ పనులు పూర్తి చేసి, రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. అనవసరంగా ముందే రోడ్లు  అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... శుభోదయ కాలనీలో రోడ్లు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారన్నారు. ఇప్పుడు ఉన్న డ్రైనేజీ పైపులైన్ ను ఎనిమిది ఇంచుల స్థానంలో పన్నెండు ఇంచుల పైపులైన్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలనీలో ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే శుభోదయ కాలనీలో డ్రైనేజీ పనులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు రమ్యభారతి, షబ్బీర్, శ్రీహరి, శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.