15 March, 2026 | 1:51 PM

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

30-12-2025 05:04 PM

స్వాగతం పలికిన గుడి చైర్మన్, పార్టీ నాయకులు

చిట్యాల,(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిట్యాల లోని కనకదుర్గ అమ్మవారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని హైదరాబాద్ నుండి నకిరేకల్ కు వెళ్తున్న ఎమ్మెల్యేకు ముందుగా గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు.