22-05-2025 12:14:28 AM
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- యాంటీ టెర్రరిజం డే ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి
కరీంనగర్, మే 21 (విజయ క్రాంతి): ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్రమోదీ నాయకత్వంలోని కేం ద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’ సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా క్రికె ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులతో కలిసి ర్యాలీ ని ర్వహించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి ర్యా లీని ప్రారంభించడంతో పాటు విద్యార్థులతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్దంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్దమయ్యారన్నారు.
పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబె ట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. ప్రపంచంలో టెర్రరిజాన్ని అణిచివేసే శక్తి సామర్ధ్యాలు భారత్ కు ఉన్నాయనే విష యాన్ని ప్రపంచమంతా గుర్తించిందన్నారు.పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని, టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం ఆర్ధిక సాయం చేస్తోందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు.
ముంబయి పేలుళ్లు, లుం బినీ పార్క్, గోకుల్ ఛాట్ పేలుళ్లు, మక్కా మసీదు పేలుళ్ల తరువాత దేశ ప్రజల్లో మార్పు వచ్చిందని,అవసరమైతే దేశం పక్షా న టెర్రరిజంపై యుద్దం చేసేందుకు సిద్దంగా ఉండటం సంతోషకరమన్నారు. పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో సా మాన్య ప్రజలను, వారి ఆవాసాలను టార్గెట్ చేసి ధ్వంసం చే యాలనుకుందని, టెక్నాలజీని ఉపయోగించుకుని వాటిని తి ప్పికొట్టిన ఘనత మన సైన్యానిది అన్నారు.
మోదీ నాయకత్వంలో అమిత్ షా సారధ్యంలో టెర్రరిజం ఏ రూపంలో అం తం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతు గా నిలవడం దేశ భక్తికి నిదర్శనమన్నారు. చిన్నా పెద్దా ముస లి ముతక తేడా లేకుండా టెర్రరిజం అంతం కోసం ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉ న్నా మట్టుపెట్టాల్సిందేనని, ఇందులో మరో ఆలోచనే లేదన్నా రు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందని బం డి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ సం ఘం బాధ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.