22-05-2025 12:12:34 AM
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు పోలీస్ కమిషనర్ సునీల్ దత్
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 21 (విజయ క్రాంతి)నేటి నుంచి ఈనెల 29 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 38 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిష్టమైన బందోబస్తు నడుమ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలన్నారు.
పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు తో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.