calender_icon.png 25 June, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చిన నేత మోదీ

25-06-2025 01:07:00 AM

బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి 

 భద్రాద్రి కొత్తగూడెం జూన్ 24 ,(విజయ క్రాంతి): శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశ యాలను నెరవేర్చిన నేత నరేంద్ర మోదీ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీనగర్ కాలనీ లోని మహిళా మోర్చా ఆధ్వర్యంలో మొక్కల పం పిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం తుదిదాకా పోరాడిన నా యకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అన్నారు.

370 ఆర్టికల్ రద్దు, మేక్ ఇన్ ఇండియా కోసం పరితపించిన నాయకుడన్నారు. శ్యాం కర ముఖర్జీ బలి దివాస్ కార్యక్రమంలో భా గంగా మొక్కలు పంపిణీ చేసిన నాయకుల ను అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని ఆయన కోరారు కార్యక్రమంలో బీజేపీ మండల అ ధ్యక్షుడు మాలోత్ గాంధీ నాయక్. స్టేట్ కౌ న్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్. పార్లమెం ట్ కో కన్వీనర్ జిల్లారపు శ్రీనివాస్ రావు. రెడ్డెం నవీన్. కవిత. పారిపత్తి వెంకన్న. ధనలక్ష్మి. అరుణ. కళావతి. శ్రీలత పాల్గొన్నారు.