13-06-2025 12:10:20 AM
ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్
కుమ్రం భీం అసిఫాబాద్, జూన్12( విజయక్రాంతి):ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుందని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గొడం నగేష్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ పాలనపై నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోదీ 11 సంవత్సరాల పాలనలో దేశం అనేక విజయాలు సాధించినట్లు వివరించారు. భారతీయులకు ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధానికి దక్కుతుందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమం పధకాలు అమలు పరుస్తున్నట్లు తెలిపారు. రామగుండంలో ఫ్యాక్టరీని ఏర్పా టు చేసి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
బీజేపీ ప్రభుత్నం సాధించిన విజయాలను ప్రజల్లోకీ తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో దేశ ప్రజలకు ధైర్యాన్ని నింపడంతో పాటు ఉచిత రేషన్ బియ్యాన్ని ఇచ్చి మోదీ అండగా నిలిచారని గుర్తు చేశారు. నేటికీ ప్రజలకు ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తుందని తెలిపారు.
నిబద్ధతతో అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోట్నాక విజయ్, చర్ల మురళి, సొల్లు లక్ష్మి, కిరణ్ కుమార్, ప్రసాద్ గౌడ్, జయరాజ్, ఆంజనేయులు, చక్రపాణి , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులను ఆదుకోవాలని వినతి
సింగరేణి గోలేటి ఓపెన్ కాస్ట్లో భూము లు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే హరీష్బాబు, కాంగ్రె స్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్లకు వేరువేరుగా గురువారం వినతి పత్రాలు అం దజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్, బిజెపి నాయకుడు ఆంజనేయులు గౌడ్, రైతులు మధుకర్, భగవంతు రావు, సద య్య, తిరుపతి తదితరులు ఉన్నారు.