22-06-2025 10:46:49 PM
క్రిస్టియన్ మైనారిటీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు యేసయ్య..
కోదాడ: స్థానిక నాయనగర్ బాప్టిస్ట్ చర్చి(Baptist Church)లో ఆదివారం పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుండి రష్యా ఉక్రెయిన్ రెండు సంవత్సరాల నుండి ఇజ్రాయిల్ గాజా ఇరాన్ ఇతర ప్రాంతాలలో జరుగుతున్న యుద్ధాలు ఆపబడాలని పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప పడాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఇట్టి యుద్ధాల వల్ల అనేకమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు పిల్లలు అనాథలవుతున్నారు అని ఆ ఇటు యుద్ధాలు ఆపడం వల్ల ప్రపంచ ప్రజలు నెమ్మదిగా ఉంటుందని అన్నారు. నడిగూడెం మండలం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి జగ్గు నాయక్ హెడ్ కానిస్టేబుల్ జాన్ మోజస్, జ్యోతి స్రవంతి పోయిలా సాల్మన్ రాంబాబు తమలపాకల సైదులు స్టెపెను గురునాథ శారా మేరమ్మ కోయర్ టీమ్ పాల్గొన్నారు.