04-06-2025 12:29:41 AM
- చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో 100 రోజుల ప్రణాళిక
- పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
- ఎకరంలో నర్సరీ, డివైడర్ల మధ్య మొక్కలు
- షాబాద్, ఊరెళ్ల చౌరస్తాలో జంక్షన్ లు
- గుండం వద్ద ‘ఐ లవ్ చేవెళ్ల’ సింబల్ ఏర్పాటు
చేవెళ్ల, జూన్ 3: మున్సిపాలిటీల్లో ఎదుర య్యే సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోం ది. ఈ మేరకు అధికారులు జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు ‘మాన్ సూన్’ పేరిట 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించా రు.
వర్షాకాలంలో అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై దృష్టి సారించనున్నారు. వన మ హోత్సవంలో భాగంగా ఖాళీ స్థలాలు, డివైడర్ల మధ్య మొక్కలు నాటనున్నారు. ము ఖ్యంగా కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. అ వసరమైన నిధుల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు, కార్యాచరణ రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు.
ప్రత్యేక ప్రణాళిక
చేవెళ్ల మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా రు. నాలాలు, ఓపెన్ పూ డిక తొలగించడం తో పాటు కొత్త వాటి ని ర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నా రు. బస్తీలు, కాలనీ లు, రహదారులు, ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో రోజూ బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణకు ఫా గింగ్ చేయించనున్నారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని మోడల్ కాల నీలో 10 శాతం భూ మిలో ఒక ఎకరంలో నర్సరీ, హౌసింగ్ బో ర్డు కాలనీలో వెయ్యి గజాల స్థలంలో పార్కు ఏర్పా టు చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు.
మున్సిపల్ కేంద్రంలోని డివైడర్ల మధ్య మొక్కలు నాటే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించారు. షాబాద్, ఊరెళ్ల చౌరస్తా లో గ్రీనరీ, వాటర్ ఫౌంటెయిన్లతో జంక్షన్లు, గుండం వద్ద ‘ఐ లవ్ చేవెళ్ల’ సింబల్ ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత డంపింగ్ యార్డు తాత్కాలి కం కావడంతో 10 ఎకరాల స్థలం కే టాయించాలని ఆర్డీవో, కలెక్టర్కు ప్రతిపాదనలు పెట్టారు. మొయినాబాద్ మున్సిపా లిటీ పరిధిలోని జేబీఐటీ, అజీజ్ నగర్, హి మాయత్ చౌరాస్తాల్లో జంక్ష న్లు ఏర్పాటు చే సేందుకు ప్రతిపాదనలు పం పామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎన్కేపల్లి, చిల్కూ రులో ఇప్పటికే నర్సరీలు ఉన్నాయని, వాటి ని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వన మహోత్సవానికి ఏర్పాట్లు
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ‘ఉమెన్ అమృత మిత్ర 2.0’ లో భాగంగా ఖాళీ స్థలాలను ఎంపిక చేసి, ‘ఉమెన్ ఫర్ ట్రీ’ పేరిట మహిళా సంఘాల స భ్యులతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణ బాధ్యతను అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, చేవెళ్ల, మొయినాబాద్ కొ త్త మున్సిపాలిటీలు కావడంతో ఈ కార్యక్ర మం ఇంకా ఇక్కడ అమలు కావడం లేదు. అయినప్పటికీ, చేవెళ్లలో గుండం వద్ద, ప్ర భుత్వ భవనాలు, క్రీడా ప్రాంగణాలు, ఖాళీ స్థలాల్లో మహిళలతో మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మౌలి క వసతుల కల్పనకు కృషి చేస్తున్నం. అండ ర్ గ్రౌండ్ డ్రేజీలు, అంతర్గ రోడ్లపైనా దృష్టి పెట్టినం. డంపింగ్ యార్డు కోసం 10 ఎకరాలు కేటాయించాలని ఆర్డీవో, కలెక్టర్ను కో రాం. నర్సరీ, పార్కు ఏర్పాటుతో పాటు డివైడర్లలో మొక్కలు నాటేందుకు ప్రజల సహ కారం కూడా కావాలి.
పూర్ణ చందర్ రావు, చేవెళ్ల మున్సిపల్ కమిషనర్